జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు
జహీరాబాద్, మే 26 : జహీరాబాద్ ప్రభుత్వ దవాఖానలో రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఆక్సిజన్ ప్లాంటు మంజూరు చేసిందని , పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే మాణిక్రావు తెలిపారు. బుధవారం జహీరాబాద్ ఏరియా దవాఖానను పరిశీలించి, కొత్తగా ప్రభుత్వం మంజూరు చేసిన ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటు చేసే పనులు పరిశీలించారు. దవాఖానలో చికిత్స పొందుతున్న 50 పడకలకు నిరంతరం ఆక్సిజన్ అందించనున్నట్లు తెలిపారు. కొవిడ్ బాధితులతో పాటు వైద్యం కోసం వచ్చే ప్రతి ఒకరికి మెరుగైన చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే మాణిక్రావు తెలిపారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో జహీరాబాద్ పట్టణ, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. సీఎం కేసీఆర్ పేదలకు కార్పొరేటు వైద్య సేవలు అందించేందుకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తున్నారన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా సీఎం కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు పంపిణీ చేస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నామ రవికిరణ్, ఎండి.యాకుబ్, బండిమోహన్, యూనూస్, అబ్దుల్లా పాల్గొన్నారు.
ఘనంగా బుద్ధ జయంతి
గౌతమ బుద్ధుని జయంతి జహీరాబాద్లో ఘనంగా నిర్వహించారు. బుధవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాణిక్రావు బుద్ధుడి చిత్రపటానికి పూలమాలేసి నివాళి అర్పించాడు.ప్రతి ఒక్కరూ బుద్ధుడి ఆచరణలో నడువాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.