రామచంద్రాపురం, జూన్ 23 : అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి అన్నారు. బుధవారం ఆర్సీపురం డివిజన్లోని రాయసముద్రం చెరువును ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పానగేశ్తో కలిసి ఆయన పరిశీలించారు. చెరువు అభివృద్ధి పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా కొనసాగించేలా చూడాలని, అందుకు పూర్తిసహకారం అందిస్తామని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి కార్పొరేటర్కు సూచించారు. అనంతరం ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమానికి ప్రభు త్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో హైదరాబాద్ మహానగరం అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. జంటనగరాల్లో తాగునీటి సమస్యలు లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నగర ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందున్నారని పేర్కొన్నారు. నగరంలో చెరువులు, కుంటలు, పార్కులను ప్రభు త్వం అభివృద్ధి చేస్తున్నదన్నారు.
రాయసముద్రం చెరువుని అన్నివిధాలుగా అభివృద్ధి చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి మా ట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలోని చెరువులన్నింటినీ అభివృద్ధి చేస్తామన్నారు. ఆర్సీపురంలోని సాకిచెరువు, రాయసముద్రం చెరువులను మినీ ట్యాంక్బండ్గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు భారతీనగర్, ఆర్సీపురం, పటాన్చెరులో థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. అనంతరం కార్పొరేటర్ పుష్పానగేశ్ మాట్లాడుతూ రాయసముద్రం చెరువును అన్నివిధాలుగా అభివృద్ధి చేసి ఈ ప్రాంతానికే కొత్తశోభ తీసుకువస్తామన్నారు. ప్రొటెం చైర్మన్ వెంట ఇరిగేషన్ డీఈ నలిని, ఏఈ శేషగిరిరావు, మాజీ కార్పొరేటర్ అంజయ్య, ఆదర్శ్రెడ్డి, మోహన్రెడ్డి, జగన్నాథ్రెడ్డి తదితరులు ఉన్నారు.
నాగులమ్మ విగ్రహప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారు..
ఆర్సీపురం జాతీయ రహదారి పక్కనే ఉన్న నాగులమ్మ ఆలయాన్ని రాయసముద్రం చెరువు కట్టపైకి మారుస్తున్న విషయం తెలిసిందే. నాగులమ్మ ఆలయ నిర్మాణ పనులు పూర్తికావొస్తున్న తరుణంలో బుధవారం కార్పొరేటర్ పుష్పానగేశ్ ఆధ్వర్యంలో ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి, ఎమ్మె ల్యే మహిపాల్రెడ్డి, గ్రామపెద్దల సమక్షంలో నాగులమ్మ విగ్రహప్రతిష్ఠాపన, బొడ్రాయి ఏర్పాటు విషయమై పురోహితుడి చేత ముహూర్తం ఖరారు చేశారు. ఆగస్టు 10, 11, 12 తేదీల్లో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన, బొడ్రాయి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆహ్వాన పత్రికను రాసి ప్రొ టెం చైర్మన్, ఎమ్మెల్యేకు అందజేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అంజయ్య, ఆదర్శ్రెడ్డి, మోహన్రెడ్డి, లక్ష్మీరెడ్డి, జగన్రెడ్డి, చంద్రశేఖర్, శ్రీను, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.