అందోల్/రాయికోడ్/పుల్కల్ రూరల్, జూన్ 21 : ఎత్తిపోతల పథకాలకు బసవేశ్వర, సంగమేశ్వర పేర్లు పెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా వీరశైవలింగాయత్ సమాజం ఆధ్వర్యంలో సోమవారం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాణిక్రావును సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో వారిని నాయకులు కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువా, పూలమాలలతో సన్మానించారు. వారిని కలిసిన వారు జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, సంఘం గౌరవ అధ్యక్షుడు జగదీశ్వర్, అధ్యక్షుడు సిద్ధేశ్వర్, రాయికోడ్ జడ్పీటీసీ మల్లికార్జున్, ఉమ్మడి పుల్కల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు శివకుమార్, నాయకులు బస్వరాజ్, శంకర్, చంద్రశేఖర్, రామప్ప, బాబుపాటిల్, శేఖర్, మధుశేఖర్, రాజేశ్వర్, మల్లప్ప పాల్గొన్నారు.
సంగారెడ్డి మున్సిపాలిటీ..
ఎత్తిపోతల పథకాలకు సంగమేశ్వర, బసవేశ్వర పేర్లు పెట్టడం సంతోషంగా ఉందని వీరశైవ లింగాయత్ సమాజం జిల్లా అధ్యక్షుడు సిద్దేశ్వర్ సులుగంటి అన్నారు. ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీశ్రావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, మాణిక్రావును జిల్లా వీరశైవ లింగాయత్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లోని మంత్రి హరీశ్రావు నివాసంలో కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు జగదీశ్వర్రావు, అధ్యక్షుడు సిద్దేశ్వర్, ప్రధాన కార్యదర్శి అనిమిశెట్టి జయప్రకాశ్, నాయకులు నాయికోటి రామప్ప, సీహెచ్ బస్వరాజ్, చంద్రశేఖర్, మధుశేఖర్, కొంక రాజేశ్వర్, మల్లికార్జున్, శివశంకర్ పాటిల్, వీరేశం, మల్లన్న, నర్సింహులు, ఎస్కే పాటిల్, శ్రీశైలం, చంద్రశేఖర్, శంకర్పాటిల్, సర్పంచ్లు తదితరులు ఉన్నారు.
మంత్రి హరీశ్రావును కలిసిన వెంకటేశంగౌడ్..
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావును టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు, జిన్నారం ఎంపీటీసీ-2 వెంకటేశంగౌడ్ హైదరాబాద్లోని మంత్రి నివాసంలో కలిశారు. మంత్రిని మర్యాదపూర్వకంగానే కలిసినట్లు వెంకటేశంగౌడ్ తెలిపారు.