సంగారెడ్డి మున్సిపాలిటీ, మే 18: కరోనా పాజిటివ్ వస్తే భయపడాల్సిన అవసరంలేదని, చికిత్సతో నయమవుతున్నదని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా ప్రభుత్వ దవాఖానలోని కరోనా వార్డును ఆయన సందర్శించారు. కరోనా వార్డులో రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. మనోధైర్యమే బలమని ఎక్కడా ధైర్యాన్ని కోల్పోకూడదని కరోనా బాధితుల్లో మనోధైర్యం నింపారు. ఈ సం దర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ డాక్టర్లు, వైద్య సిబ్బందికి కరోనా పేషెంట్లకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కరోనా బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. కరోనా కోసం ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ దవాఖానలో కరోనాకు అన్ని రకాల చికిత్సలు అందిస్తున్నారని, కరోనా వస్తే ప్రైవేట్ దవాఖానల్లో చేరి లక్షల రూపాయలు వృథా చేసుకోవద్దని తెలిపారు. జిల్లా దవాఖానలో ఆక్సిజన్ బెడ్లు, 15 వెంటిలేటర్ల సదుపాయం ఉందని తెలిపారు. మైల్డ్ సింప్టమ్స్ ఉంటే ఇంట్లోనే చికిత్స పొందుతూ కొవిడ్ను నయం చేసుకోవచ్చని భరోసా కల్పించారు. దవాఖానను సందర్శించిన వారిలో ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీఎస్పీ బాలాజీ, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సంగారెడ్డి, నాయకులు బొంగుల రవి, డాక్టర్లు, సిబ్బంది ఉన్నారు.