జహీరాబాద్, ఏప్రిల్ 18 : ఎండలు మండుతున్నా నారింజ ప్రాజెక్టు, చెరువులు మాత్రం నీటితో కళకళలాడుతున్నాయి. జహీరాబాద్ మండలంలోని కొత్తూర్ (బీ), మల్చల్మా గ్రామ శివారులో ఉన్న ఈరన్న వాగు చెరువు, ఝరాసంగం మండలంలోని ఏడాకులపల్లి చెరువులను మిషన్ కాకతీయలో నిధులు మంజూరు కావడంతో అలుగు, కాల్వలు, తూం, కట్టకు మరమ్మతులు జరిగాయి. చెరువుకు లీకేజీలు లేవు. వాన నీరు పుష్కలంగా నిల్వ ఉండి నీటితో కళకళలాడుతోంది. గతంలో వేసవికాలం రాగానే చెరువులో నీరు లేక ఎడారిగా ఉండేది. టీఆర్ఎస్ ప్రభుత్వం చెరువులకు మరమ్మతులు చేయడంతో వాన నీరు పుష్కలంగా నిల్వ ఉండి భూగర్భ జలాలు పెరిగిపోవడంతోపాటు వ్యవసాయ పంటల సాగు పెరిగింది. దీంతో రైతులు ఎండకాలంలో నీరు పుష్కలంగా ఉండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పశువులకు తాగునీటి కష్టాలు లేవు, వ్యవసాయ బావులు, తాగునీటి బోర్లులో పుష్కలంగా నీరు ఉంది. మిషన్ కాకతీయ ఫలితలు రావడం తో నీటి కష్టాలు దూరమయ్యాయి. నారింజ ప్రాజెక్టు గేట్లుకు మరమ్మతులు చేయకపోవడంతో గతంలో చుక్క నీరు నిల్వ లేక ఎడారిగా ఉండేది. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి గేట్లుకు మరమ్మతులు చేయడంతోపాటు, ప్రాజెక్టులో నిండిపోయిన పూడికమట్టిని తొలిగించడంతో నీరు పుష్కలంగా ఉంది. దీంతో జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగం మండలంలో భూగర్భ జలాలు పెరిగిపోయాయి.
ఇవి కూడా చదవండి
కారు, జీపు ఢీ..నలుగురికి తీవ్ర గాయాలు
కొడుకుతో హైదరాబాద్ రోడ్లపై ఎన్టీఆర్ చక్కర్లు..!