సంగారెడ్డి, మే 16: కరోనా కట్టడికి తెలంగాణ సర్కార్ తీసుకున్న లాక్డౌన్ నిర్ణయంతో ఊరట కలుగుతున్నది. ప్రజల సహకారంతో పక్కాగా లాక్డౌన్ అమలు జరుగుతున్నది. ఆదివారం సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని కంది, కొండాపూర్, సదాశివపేట, సంగారెడ్డి మండలం, పట్టణాలలో పటిష్టంగా లాక్డౌన్ అమలు జరిగింది. పట్టణంలో దుకాణ సముదాయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ ఎప్పటికప్పుడు లాక్డౌన్ పర్యవేక్షిస్తూ పోలీసులకు సూచనలు చేస్తూ ఉదయం 10 గంటల తరువాత రోడ్లపై తిరిగే వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఉదయం కొత్త బస్టాండ్ ఎదుట ఏర్పాటు చేసిన పోలీస్ పికేటింగ్, పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో రోడ్లపైకి వచ్చిన వాహనదారులను ఆపి సమగ్రంగా విచారణచే సి, తనిఖీలు నిర్వహించి లాక్డౌన్లో బయటి తిరగొద్దని సూచించారు.
అలాగే, సదాశివపేట పట్టణంలో ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, ఎస్ఐలు రవి, ప్రశాంత్ లాక్డౌన్ను పర్యవేక్షించారు. కొండాపూర్ మండలంలోని గ్రామాల్లో పోలీసులు తిరుగుతూ ప్రధా న కూడళ్లలో ప్రజలు గూమిగూడరాదని, సడలింపు సమయం దాటిన తరువాత ఇండ్లలోనే ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు. కంది మండలంలో ఇంద్రకరణ్ ఎస్ఐ రాజేశ్ నాయక్ ఆధ్వర్యంలో లాక్డౌన్ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిందని, అవసరం లేకున్నా బయటికి వచ్చి పోలీసులకు ఇబ్బందులు కలిగించొద్దని సూచించారు. లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ప్రజలు సహాయ సహాకారాలు అందించి కరోనాను నివారించేందుకు కృషి చేయాలన్నారు. డీఎస్పీ వెంట సంగారెడ్డి పట్టణ ఇన్స్పెకర్టర్ రమేశ్, రూరల్ ఇన్స్పెక్టర్ శివలింగం, ఎస్ఐలు లక్ష్మారెడ్డి, సుభాశ్, పోలీస్ సిబ్బంది తదితరులున్నారు.