సంగారెడ్డి, మే 14: ముస్లింలు రంజాన్ను భక్తిశ్రద్ధలతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారి ఇండ్లల్లోనే జరుపుకున్నారు. కరోనా విస్తరిస్తున్న సమయం కావడం, ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో నిరాడంబరంగానే వేడుకలు నిర్వహించారు. కాగా, ముస్లింలు ఎక్కువగా కనిపించకపోవడంతో పట్టణంలోని ఈద్గా మైదానం వెలవెల బోయింది. ఎవరికి వారు ఫోన్ల ద్వారా పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి
పటాన్చెరు/ రామచంద్రాపురం, మే 14: లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల మేరకు మసీదుల్లో కాకుండా ముస్లింలు ఎవరి ఇంట్లో వారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్రెడ్డిలు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పటాన్చెరు, ఆర్సీపురం, భారతీనగర్ డివిజన్ల్లో కార్పొరేటర్లు మెట్టుకుమార్యాదవ్, పుష్పానగేశ్, సింధూఆదర్శ్రెడ్డి, తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీల్లో చైర్పర్సన్లు, చైర్మన్లు లలితసోమిరెడ్డి, పాండురంగారెడ్డి, కొలన్ రోజారాణిలతో పాటు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచ్లు ఇతర ప్రజాప్రతినిధులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
మండల వ్యాప్తంగా..
గుమ్మడిదల, మే14: కానుకుంట, బొంతపల్లి, వీరన్నగూడెం, దోమడుగు, అన్నారం, నల్లవల్లి తదితర గ్రామాల్లో రంజాన్ వేడుకలను నిర్వహించుకున్నారు.
ఇంటి వద్దే ప్రార్థనలు
బొల్లారం/ జిన్నారం, : మత సామరస్యానికి, త్యాగానికి ప్రతీక అయిన రంజాన్ వేడుకలను ప్రజలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. లాక్డౌన్ నిబంధనలు కొనసాగుతున్న నేపథ్యంలో ముస్లిం సోదరులు ఇంటివద్దే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరసోదరిమణులకు ప్రజాప్రతినిధులు, అధికారులు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
నిరాడంబరంగా రంజాన్ వేడుకలు
అమీన్పూర్: అమీన్పూర్ మండలంలోని ముస్లింలు శుక్రవారం రంజాన్ వేడుకలను నిరాడంబరంగానే నిర్వహించుకున్నారు. కరోనా విస్తరిస్తున్న తరుణంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో ఎవరికి వారు ఇండ్లల్లోనే ప్రత్యేక ప్రార్థనలు చేసుకున్నారు.