సంగారెడ్డి, మెదక్ జిల్లా కేంద్రాల్లో జయంతి వేడుకలు
పాల్గొన్న సంగారెడ్డి, మెదక్ కలెక్టర్లు
అంబేద్కర్కు నివాళులర్పించిన జడ్పీ చైర్ పర్సన్లు మంజుశ్రీజైపాల్రెడ్డి, హేమలతాశేఖర్గౌడ్
సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 14: సామాజిక అసమానతలు రూపుమాపేందుకు ఒక్కటే సరైన మార్గమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వసించారని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకొని బుధవారం పట్టణంలోని ఆయన విగ్రహానికి కలెక్టర్, జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, అదనపు కలెక్టర్ రాజర్షి షా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుబడిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని పేర్కొన్నారు. రాజ్యంగ రూపకర్త, కుల వివక్షత లేని సమాజం కోసం పాటుబడిన మహోన్నతుడని కొనియాడారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివని ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తుచేశారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషిచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ అఖిలేశ్రెడ్డి పాల్గొన్నారు.
రాజనీతిజ్ఞుడు అంబేద్కర్ :సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి
రాజనీతిజ్ఞుడు, రాజ్యాంగ రూపకర్త, కులవివక్షత లేని సమాజం కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి కొనియాడారు. బుధవారం జడ్పీ హాలులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాజిక అసమానతలను దూరం చేసేందుకు ప్రతిఒక్కరూ విద్య నేర్చుకోవాలని సూచించారని గుర్తుచేశారు. అంబేద్కర్ కలలు గన్న సమాజ నిర్మాణానికి నడుం బిగించి ముందుండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జట్పీ సీఈవో ఎల్లయ్య, కార్యాలయ అధికారులు వేణుగోపాల్, శ్రీనివాస్రెడ్డి, రవి, విజ్ఞాన్, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, టీపీటీఎఫ్, కేవీపీఎస్, సీఐటీయూ, ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి, పద్మశాలీ సంఘం, తహసీల్దార్ కార్యాలయం, ఎద్దుమైలారం గ్రామంలో జయంతిని నిర్వహించారు.
మెదక్ కలెక్టరేట్లో…
అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ.. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడు అంబేద్కర్ అని మెదక్ కలెక్టర్ హరీశ్ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలో పాల్గొని ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు అని కొనియాడారు. రాజ్యాంగ రచనలో చాలా చాప్టర్లకు ఆయన ముఖ్య భూమిక పోషించి, రచనను పూర్తిగా పర్యవేక్షించారని తెలిపారు. బ్రిటీష్ ప్రభుత్వం వైస్రాయి గవర్నమెంట్లో కార్మిక శాఖ మంత్రి, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. సాంత్రంత్య్రం రాకముందు నుంచి వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టేలా ముందు చూపుతో సూచించిన గొప్ప మేధావి అంబేద్కర్ అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రమేశ్, వెంకటేశ్వర్లు, ఆర్డీవో సాయిరాం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవయ్య, డీఎస్సీడీవో విజయలక్ష్మి, డీఈవో రమేశ్, డీఎస్వో శ్రీనివాస్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మల్లేశం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాతూరి రాజు, జిల్లా అధ్యక్షుడు రమేశ్, ఎస్సీ కార్పొరేషన్, ఇతర సిబ్బంది తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.