సంగారెడ్డి, మే 13 : ముస్లింలు రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, శాంతియుతంగా సోదరా భావంతో వేడుకలు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. గురువారం పట్టణంలోని కింగ్స్ ప్యాలెస్లో టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు మసూద్, హసీబ్, యుసూఫ్ సహకారంతో వెయ్యి మంది పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. నేడు బసవేశ్వరుడి జయంతిని పురస్కరించుకుని, అక్షయ తృతీయ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగను లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. కరోనాను నియంత్రించే బాధ్యత మనపై ఉన్నదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఆర్.వెంకటేశ్వర్లు, పెరుమాళ్ల నర్సింహులు, ఆత్మ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు రవి, అజీమ్ పాల్గొన్నారు.