పటాన్చెరు , ఏప్రిల్ 13 : నేటి నుంచి ప్రవిత్రమాసం రంజాన్ ప్రారంభమౌతున్నది. ముస్లిం సోధరులు నెల రో జుల పాటు కఠోరమైన ఉపవాసాలుంటారు. సూర్యోదయానికి ముందు అల్పహారంతో ప్రారంభించి సూర్యస్తమయం వరకు 15గంటలపాటు ఉపవాస దీక్ష కోనసాగుతుంది. ఉపవాసం ఉన్న భక్తులు ఆహారంతో పాటు పచ్చి మంచినీరు సైతం తీసుకోరు. దీక్ష ముగిసే వరకు రోజు 5పూటల నమాజులు చదవడం చేస్తారు. చెడు చూడడం, మాట్లా డం, వినడం అనేది నిషేదం. పవిత్రంగా ఉండడంతో పాటు నెలరోజులు పూర్తిగ ఆధ్యాత్మికమైన వాతావరణంలో ప్రార్థనలతో గడుపుతారు. ప్రతి రోజు రాత్రి జ రిగే తరావీ నమాజు ఈ రంజాన్కు ప్రత్యేకం. ఈ న మాజులో 20రకాతుల తరావీ నమాజును చదవుతారు. ఈ నమాజులో 30 ఆధ్యాయాలున్న పూర్తి ఖురాన్ను పారాయణం చేస్తారు. రంజాన్ మా సం ఆధ్యాత్మిక సుగంధాలు పంచుతూ పేద, ధనిక భేదాలను దూరం చేస్తుంది. మనిషిలో సత్ప్రవర్తనను పెంచెందుకు ఈ నెల ఉపయోగపడుతుంది.
నెల రోజుల ఈ ఉపవాస రో జా దీక్షలకోసం జిల్లాలోని ప్రతి మజిద్ ము స్తాబౌతున్నది. ఉపవాసం ముగించే సమయంలో పండ్లను భారీగా కొంటారు. ఈ మేరకు పండ్ల వ్యాపారులకు మంచి బేరాలుంటాయి. అయితే ఈ మారు రంజాన్ దీక్షలు నడి వేసవిలో వస్తుండటంతో భ క్తులు ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. పచ్చి మంచినీరుకూడా తాగరాదని నియమం ఉండటంతో భక్తులు దా హంతో తల్లడిల్లిపోయె అవకాశం ఉం ది. కష్టాలను ఎదురించి దీక్షలను విజయవంతం చేసేవారినే దేవుడు అభిమానిస్తాడనే భావం ఉండటంతో కఠో ర దీక్షకు ముస్లింలు మనసార సిద్ధం అవుతున్నారు. రంజాన్ మాసం అనగానే ముస్లింలకంటే ఎక్కువగా అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూసేది హలీ మ్ రుచుల కోసం. పొట్టేలు మాంసం, చికెన్లతో చేసే హలీమ్ తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారు.
అయితే గత ఏడాది రంజాన్కు కోవిడ్ ఆటంకం సృష్టించింది. ఈ ఏడాది రంజాన్కు కూ డా కోవిడ్ వైరస్ వ్యాప్తి పుంజుకున్నది. మసీదుల సదర్లు కోవిడ్ నిబంధనలను అమలు చేసేందుకు ముందుకు వస్తున్నా రు. మాస్క్లు ధరించి నమాజులకు రావాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. భౌతికదూరం అమలు చేసేందుకు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం మజీద్ల వద్ద భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించెందుకు స్థానిక అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం తదితర అంశాలను అధికారులు పట్టించుకుంటున్నారు. మరో పక్క ఆధ్యాత్మిక మాసంలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించెందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ముస్లిం సోదరుల పవిత్రమాసం రంజాన్ నెల బుధవారం నుంచి ప్రారంభం కానున్నది. మంగళశారం సాయంత్రం నెలవంక ఆకాశంలో కనిపించడంతో మస్జిద్లలో సైరన్లు మోగించారు. దీంతో ముస్లిం సోదరులు ఒకరికి ఒకరు రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇదే రాత్రి రంజాన్ ప్రత్యేక ప్రార్ధ న తరవి నమాజులు చేశారు. ఆదివారం తెల్లవారు జామున సహ ర్( అల్పహారం) తీసుకుని వారు ఉపవాస దీక్షను కోనసాగిస్తారు. సాయంత్రం సుర్యుడు అస్తమించే వేళలో వారు ఇఫ్తార్ను(దీక్షను విరమిస్తారు) చేసి వదులుతారు. రంజాన్ నెల రోజులు మొత్తం ఈ ఉపవాసదీక్షలు ముస్లింలు కొనసాగిస్తారు. అత్యంత నిష్టతో పవిత్రంగా ఈ ఉపవాసాలను చేస్తారు. దీక్ష సమయంలో ఆహారంతో పాటు కనీసం మంచినీరు సైతం త్రాగరు.
నెల రోజులు మస్జిద్లలో ప్రత్యేక తరవీ నమాజ్లు రాత్రి వేళలో చదువుతారు. నెల రోజుల కాలంలో మొత్తం ఖురాన్ను పారాయణం చేస్తారు. ఒక్క రోజు ప్రార్ధన తప్పితే అది పెద్ద తప్పిదం అన్నట్టుగా భక్తులు భావిస్తారు. సంవత్సర కాలంగా తమకిష్టమైన రీతిలో జీవించిన ప్రజలు ఒక్క మాసం మాత్రం అల్లా కోరిన విధంగా ఆయనను కొలుస్తు రోజాలను పాటించాలి. ఉపవాసం చేసే సమయంలో ఎలాంటి చేడు చేయకుండా, చెడు చూడకుండా, వినకుండా ఉంటారు. లేని పక్షంలో వారి ఉపవాసం (రోజా) విలువలేకుండా పోతుందని విశ్వాసం.ఒక్క రోజాను ఆచరించకపోయిన దానికి సాటిగ ఏడాదిపాటు ఉపవాసం ఉన్నా ఆ రంజాన్ ఉపవాసానికి సాటిరాదని ఆదేశాలున్నాయి.
రంజాన్ మాసంలో ముపై రోజులు రోజాలు పాటించిన అనంతరం రంజాన్ పండుగ ఈదుల్-ఫితర్ పండుగను జరుపుకుంటారు. నెల రోజుల సుధీర్ఘకాలం జరిగే ఈ పండుగను ముస్లిం సోదరులు అత్యంత గోప్పగా జరుపుకుంటారు. పండుగ దగ్గర పడ్డ తర్వాత నూతన వస్ర్తాలు, ఇతర షాపింగ్లు పెరిగిపోతాయి. ఈ పండుగపై పలు రంగాల వ్యాపారులు ఆశలు పెట్టుకుని ఉన్నారు. అయితే ఈ మారు కోవిడ్ వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నందుకు ఆ మేరకు శాపింగ్లు, ఈద్ వాతావరణం ఉంటుందా అనేది కొంతమేరకు సందేహంగానే ఉన్నది. భక్తి పూర్వకంగా ఉపవాసాలు చేయడం తప్పనిసరి కావడంతో దీక్షలను మాత్రం విడువకుండా చేస్తామని భక్తులు చెబుతున్నారు.