చేర్యాల/మద్దూరు/ధూళిమిట్ట/బెజ్జంకి/అక్కనపేట/ మిరుదొడ్డి/కోహెడ/హుస్నాబాద్/హుస్నాబాద్ టౌన్/ దౌల్తాబాద్, ఏప్రిల్ 11: పేద, బడుగు బలహీన వర్గాల వారు కూడా అక్షర జ్ఞానం నేర్చుకోవాలని, తద్వారా ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలనే లక్ష్యంతో జీవితాంతం కృషి చేసిన జ్యోతిరావుఫూలే ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఆయన జయంతిని హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీసీ, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ, దళిత సంఘాల నాయకులు కొయ్యడ కొమురయ్య, పచ్చిమట్ల రవీందర్గౌడ్, వడ్డెపల్లి మల్లేశం, ఎండీ హసన్, ఎగ్గోజు ఈశ్వర్, కేడం లింగమూర్తి, కోమటి సత్యనారాయణ, అక్కు శ్రీనివాస్, చంద్రమౌళి, మల్లికార్జునరెడ్డి, థామస్, ముక్కెర సంపత్ కుమార్, గడిపె కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
మిరుదొడ్డిలో ..
అందె గ్రామంలో ఫూలే జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కేరింగ్ సిటీజన్స్ కలెక్టివ్ (సీసీసీ) జిల్లా కో-ఆర్డినేటర్ సూకురి ప్రవీణ్, నేతలు ఉన్నారు.
ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం
పూలే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఎంపీపీ లిం గాల నిర్మల అన్నారు. బెజ్జంకీ మండల కేంద్రంలో ఆమె నివాళులర్పించారు. జడ్పీటీసీ కనగండ్ల కవితతో కలిసి పూలే విగ్రహానికి పూలమాల వేసి ఫూలే సేవలను కొనియడారు.
ధూళిమిట్టలో..
ధూళిమిట్ట మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ఫూలే జయంతిని నిర్వహించారు. సర్పంచ్ దుబ్బుడు దీపిక వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పీఏసీఎస్ చైర్మన్ నాగిళ్ల తిరుపతి రెడ్డి, ఉపసర్పంచ్ పోతరాజు మధు, గ్రామస్తులు ఉన్నారు. బెక్కల్లో సర్పంచ్ కూకట్ల బాల్రాజ్ యాదవ్ ఫూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మహనీయుడు ఫూలే..
ఫూలే మహనీయుడని మున్సిపల్చైర్పర్సన్ ఆకుల రజితవెంకన్న అన్నారు. హుస్నాబాద్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మున్సిపల్ కమిషనర్ ఎస్. రాజమల్లయ్య, కౌన్సిలర్లు ఉన్నారు. మద్దూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పూలే చిత్రపటానికి గ్రామ సర్పంచ్ ఆలేటి రజితాయాదగిరి పూలమాల వేసి నివాళులర్పించారు. చేర్యాలలో బీసీ సంక్షేమ సమితి పట్టణాధ్యక్షుడు తౌట రమేశ్ ఆధ్వర్యంలో ఫూలే జయంతిని నిర్వహించారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో వివిధ సంఘాల నాయకులు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఆది వెంకన్న, రాష్ట్ర ఎమ్మా ర్పీఎస్ కార్యదర్శి, డప్పు శివరాజ్ మాదిగ ఉన్నారు.
ఇవీ కూడా చదవండి…
నియోజకవర్గ శ్రేయస్సుకు పాటుపడుతున్న ఎమ్మెల్యే
అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడు