సంగారెడ్డి, మే 10 : రంజాన్ పండుగను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు రం జాన్ తోఫాలను అందజేస్తున్నదని కులబ్గూ ర్ ఉపసర్పంచ్ హశం అలీ అన్నారు. సోమవారం సంగారెడ్డి మండలం కులబ్గూర్లో ముస్లింలకు రంజాన్ తోఫాలను ఆయన అందజేశారు.
పేదలకు సాయం చేయడంలోనే తృప్తి
పేదలకు సాయం చేయడంలో ఎంతో తృప్తి ఉంటుందని సదాశివపేట ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు తుల్జారం అన్నారు. తులారం జన్మదినం సందర్భంగా పేటలోని ముదిరాజ్ భవన్లో 200 మంది ముస్లింలకు రంజాన్ కానుకలను అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పులిమామిడి రాజు, ముదిరాజ్ సంఘం నాయకులు మునిపల్లి సత్యనారాయణ, హనుమంతు, చితనందం సతీశ్, బంటు రవి, లడ్డు, సున్నం నరేశ్, అరుణ్, నల్లా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఐలాపూర్లో…
సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యా యం జరుగుతున్నదని ఎం పీపీ దేవానంద్, జడ్పీటీసీ సుధాకర్రెడ్డి అన్నారు. అమీన్పూర్ మండలం ఐలాపూర్ లో ముస్లింలకు రం జాన్ తోఫాలను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మ ల్లేశ్, నాయకులు సత్యనారాయణ పాల్గొన్నారు.