బొల్లారం, మే 7 : మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటి ఆరోగ్య సర్వేలో పాల్గొనే సిబ్బందికి శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ రోజాబాల్రెడ్డి మెడిసిన్ కిట్లను అందజేశారు. సర్వే సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ రాజేంద్రకుమార్తో కలిసి ఆమె కిట్లను అందజేశారు. సర్వేను పకడ్బందీగా చేపట్టాలని వారు సిబ్బందికి సూచించారు. సర్వేలో ఆర్వో శ్రీధర్, వైద్యురాలు రాధిక, హెచ్ఈవో వెంకటరమణ, పర్యావరణ ఇన్స్పెక్టర్ సాయికిరణ్రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ వినోద్కుమార్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి మున్సిపాలిటీ…
సంగారెడ్డి మున్సిపాలిటీ, మే 7 : కరోనాను కట్టడికి పట్టణంలో నిర్వహిస్తున్న జ్వ ర సర్వేకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటింటి సర్వేలో కరోనా వ్యాధి లక్షణాలు అంటే మెడికల్ కిట్లను వైద్య సిబ్బంది అందజేస్తున్నారని తెలిపారు.
రెండు రోజుల్లో 3152 ఇండ్ల సర్వే
కల్హేర్, మే 7: కరోనాను కట్టడి చేసేందు కు మండలంలోని 26 గ్రామ పంచాయతీ ల్లో 3152 ఇండ్లను సర్వే చేసినట్టు వైద్యాధికారి నరేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గురువారం ఒక్క రోజే 999 ఇండ్లు, 2153 ఇండ్లను సర్వే చేశామన్నారు. ఇం దులో గురువారం 81 మంది, శుక్రవారం 109 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరందరిని ఐసొలేషన్ చేయడంతోపాటు మెడికల్ కిట్లను అందజేశామని తెలిపారు. సర్వే చేపట్టిన నివేదికలను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు.
గ్రామాల్లో ఆరోగ్య సర్వే
వట్పల్లి, మే 7 : మండలంలోని పలు గ్రామాల్లో ఆరోగ్య, రెవెన్యూ, పంచాయతీ, ఐకేపీ సిబ్బంది, ఆశ వర్కర్లు ఇంటింటికీ తిరుగుతూ ఆరోగ్య సర్వే నిర్వహించారని ఎంపీడీవో గీత తెలిపా రు. మండలంలోని పలు గ్రామాల్లో సిబ్బంది సర్వే చేశారన్నారు. సందర్భంగా జలు బు, దగ్గు, జ్వరం ఇతర ఆ రోగ్య సమస్య లు ఉన్నవారిని గుర్తించి మందులు అందజేశామని తెలిపారు. ఆరోగ సర్వేకు ప్రజ లు సహకరించాలని కోరారు.
కరోనా కట్టడికి చర్యలు
వట్పల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో రైతులు సౌకర్యార్థం అన్ని సదుపాయాలు కల్పించడంతోపాటు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని మార్కెట్ కార్యదర్శి ప్రతాపరుద్రమగౌడ్ అన్నారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. ధాన్యం విక్రయించేందుకు వచ్చే రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కొనసాగుతున్న సర్వే
అందోల్, మే 7 : కరోనా వైరస్ పట్ల ప్రజ లు అప్రమత్తం గా ఉండాలని, ఎంపీడీవో సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రవీణ్ సూచించారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగున్న నేపథ్యంలో మండలంలోని గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఇంటింటి సర్వే చేసి జలుబు, దగ్గు, జ్వరం ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తిం చి మెడికల్ కిట్లను అందజేశామన్నారు.
అన్నారం….
గుమ్మడిదల, మే 7 : కరోనా ఉధృతిని తగ్గించడానికి అధికారులు ఇంటింటికీ తిరుగుతూ సర్వే నిర్వహిస్తున్నారు. శుక్రవారం మండలంలోని అన్నారం గ్రామంలో తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో చంద్రశేఖర్, సర్పంచ్ తిరుమలవాసుతో కలిసి ఊరంతా సర్వే చేశారు.
అమీన్పూర్…
అమీన్పూర్, మే 7 : ప్రభుత్వం ఆదేశాల మేరకు కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు మున్సిపల్ అధికారులు, వైద్య సిబ్బంది చర్యలు చేపట్టారు. అమీన్పూర్ మున్సిపల్ సిబ్బందితోపాటు ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు సంయుక్తంగా ఇంటింటికీ తిరుగుతూ సర్వే చేపట్టారు. మొదటి రోజు 1402 మందిని సర్వే చేయగా 47 మందికి కరోనా లక్షణా లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
సోడియం హైపోక్లోరైట్తో పిచికారీ
రామచంద్రాపురం, మే 7 : కరోనా కట్టడి కోసం బల్దియా అధికారులు చర్యలు చేపట్టారు. ఆర్సీపురం డివిజన్లోని రామచంద్రారెడ్డినగర్లో డివిజన్ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పానగేశ్ నేతృత్వంలో సిబ్బంది ప్రతి వీధిలో సోడి యం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.కార్యక్రమంలో ఎంటమాలజీ సూపర్వైజర్ ఇజాజ్, పాల్గొన్నారు.
సంగారెడ్డిలో…
సంగారెడ్డి, మే 7 : కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వేను కంది మండల నాయబ్ తహసీల్దార్ దినేశ్రెడ్డి పర్యవేక్షించారు. శుక్రవారం కంది మండల కేంద్రంలోని లక్ష్మీనగర్ కాలనీలో ఆశ వర్కర్లు చేస్తున్న సర్వేను తహసీల్దార్ పరిశీలించారు.