సదాశివపేట, ఏప్రిల్ 7 : రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ అన్నారు. బుధవారం సదాశివపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో శనిగల కొనుగోలు కేంద్రాన్ని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాట్లాడుతూ సదాశివపేట మార్కెట్ యార్డు పరిధిలోని గ్రామాల్లో శనగలు ఎక్కువ పండిస్తారన్నారు. మార్క్ఫెడ్ సహకారంతో సదాశివపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. సదాశివపేట పరిధిలో సుమారు 1300 ఎకరాల్లో శనగపంటను పండిస్తారని, 9వేల నుంచి 10వేల క్విం టాళ్ల శనగల దిగుబడి వస్తుందని తెలిపారు. శనగలకు క్వింటాలుకు రూ.5,100 ధరను నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు తేమ లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి మద్దతు ధర పొం దాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కె ట్ కమిటీ చైర్పర్సన్ గడీల సుమిత్ర, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్రెడ్డి, సదాశివపేట మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కుమార్గౌడ్, రాజు, మొగులయ్య, చత్రనాయక్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుధీర్రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.