పల్లెటూర్లలో విరివిగా అల్లనేరేడు పండ్లు లభ్యం
మద్దూరు, జూన్6 : సంపూర్ణ ఆరో గ్యం కోసం సీజనల్గా దొరికే ప్రతి పండు ఓ ఔషధమే అని పెద్దలు చెబుతుంటారు. అలాంటి సీజనల్ పండ్లలో నేరేడు పండ్లు ఎంతో ముఖ్యమైనవి. నల్లగా నిగనిగలాడుతూ నోట్లో వేసుకుంటే తీపి, వగరు, పులుపు రుచులతో ఇట్టే కరిగిపోయే పోషకాల గని..అనారోగ్యాల నివారిణి అల్లనేరేడు పండు. నేరేడు పండ్లు శక్తినందించి.. ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు.. కొన్ని రకాల రోగాలను నియంత్రించే శక్తి నేరేడు పండు సొంతం.
ఒక్క పండే కాదు అల్లనేరేడు ఆకులు..బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆక్సాలిక్ టాన్మిన్ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం వంటివి నేరేడు పండులో పుష్కలంగా లభిస్తాయి. వేసవి ముగిసి వర్షాకాలం ప్రారంభ దశలో(జూన్ మా సంలో) అల్లనేరేడు పండ్లు విరివిగా దొరుకుతాయి. ప్రధానంగా వ్యవసాయ బావు ల వద్ద పొలాల గట్లపై అల్లనేరేడు చెట్లు ప్రస్తుతం విరగకాసాయి.
అల్లనేరేడు పండ్లకు భలే గిరాకీ..
ప్రస్తుతం మార్కెట్లో అల్లనేరేడు పండ్లకు చాలా డిమాండ్ ఉంది. ఏడాదికొక్కమారు దొరికే అల్లనేరేడు పండ్లను కొనేందుకు ప్రజలు ఆసక్తిని కనబర్చుతున్నారు. కిలో అల్లనేరేడు పండ్లు రూ. 100కు పైగా ధర పలుకుతుందంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. గ్రామాల్లో పండిన అల్లనేరేడు పండ్లను పట్టణ ప్రాం తాలకు తరలించి రైతులు లాభాలను పొందుతున్నారు.
నేరేడు పండ్లలో అతి తక్కువ ైగ్లెసిమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల ఇవి మధుమేహగ్రస్తులకు చాలా మంచిది. ఇది మధుమేహగ్రస్తుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ను కంట్రోల్ ఉంచడమే కాదు, సాధారణంగా వచ్చే మధుమేహ లక్షణాలైన దాహం, తరుచూ యూరినేషన్ వంటి లక్షణాలను నివారిస్తుంది. అల్లనేరేడు పండు మధుమేహ బాధితులకు వరంలా పనిచేస్తుంది. గింజల్ని ఎంటబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి. అదేవిధంగా నేరేడు పండ్లలో పొటాషియం కంటెంట్ అత్యధికంగా ఉంటుంది. దీంతో ఈ పండ్లను తినడం వల్ల గుండె సంబంధిత జబ్బులకు దూరంగా ఉండవచ్చు. నేరేడు పండ్ల వల్ల రోగనిరోధక శక్తి పెరిగి, రోగాలు ధరి చేరవని వైద్యనిపుణులు చెబుతున్నారు.
నేరేడు పండు ఆరోగ్యానికి మంచిది. .
ఔషధగుణాలు కల్గిన చెట్టు. ప్రతీ 100 గ్రాముల నేరేడులో ప్రోటిన్లు 0.7శాతం, క్రొవ్వులు 0.3, ఖనిజాలు 0.04, నారం 0.9, పిండిపదార్థాలు 15మీ.గ్రా. ఫాస్పరస్ 15, ఐరన్ 1.2, విటమిన్-సి 18మీ.గ్రాములుగా లభిస్తాయి. దీనిలో ఉన్న చక్కెరలో గ్లూకోజ్, ప్రక్టోజ్లు ముఖ్యమైనవి.