జిన్నారం, ఏప్రిల్ 5 : బాబూ జగ్జీవన్రామ్ అందరికీ ఆదర్శప్రాయుడని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు గొప్పవని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం వావిలాల గ్రామంలో బాబూ జగ్జీవన్రామ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరు ప్రేమగా బాబూజీ పిలుచుకునే గొప్ప నాయకుడు జగ్జీవన్రామ్ అని అన్నారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, సర్పంచ్ సుశాంతి, ఉపసర్పంచ్ నవనీత్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, సర్పంచ్లు ఆంజనేయులు, శివరాజ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్, ప్రభాకర్రెడ్డి, నరేందర్, గ్రామస్తులు పాల్గొన్నారు. అదేవిధంగా ఊట్లలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మాదారం గ్రామంలో ఏఐఎస్ఎస్డీ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మాదారం సర్పంచ్ సరితసురేందర్గౌడ్, ఎస్.మహేశ్, ఏఐఎస్ఎస్డీ నాయకులు అంబదాస్, రాజు, రామకృష్ణ, అంబేద్కర్ సంఘం నాయకులు అన్నారం వెంకటేశ్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
పటాన్చెరు, ఏప్రిల్ 5 : దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జీవితం నేటి తరానికి ఆదర్శమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి బాబూ జగ్జీవన్ రామ్ సేవలు మరవలేనిదన్నారు. కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ అఫ్జల్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్కుమార్, గూడెం మధుసూదన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో..
బాబూ జగ్జీవన్రామ్ 113వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం సదాశివపేట పట్టణంలోని బాబూ జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్రామ్ అని కొనియాడారు. దేశ మొట్టమొదటి ఉప ప్రధానిగా ప్రజలకు విశేష సేవలందించారన్నారు. పద్మశాలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు యాదగిరి ఆధ్వర్యంలో, బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో, ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో జయంతిని వేరు వేరుగా జిల్లా కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాల్, దళిత నాయకుడు సుక్కల్ల నాగరాజు, కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం, చౌదరి ప్రకాశ్, సమి, శివకుమార్, విద్యాసాగర్రెడ్డి, ఎంపీటీసీ బాలయ్య పాల్గొన్నారు.
టీఆర్ఎస్ డివిజన్ కార్యాలయంలో..
రామచంద్రాపురం, ఏప్రిల్ 5 : ఆర్సీపురం డివిజన్లోని పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పానగేశ్ జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో మల్లేశ్, రాంచందర్రావు, అశోక్, శ్రీను, యాద య్య, లక్ష్మీనారాయణ, గోపాల్ పాల్గొన్నారు.
వివిధ సంఘాల ఆధ్వర్యంలో..
సంగారెడ్డి, ఏప్రిల్ 5 : బాబూ జగ్జీవన్రామ్ 114వ జయంతిని పురస్కరించుకుని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో, బస్ డిపోలో డీఎం నాగభూషణం, పద్మశాలీ సంఘం, కేవీపీఎస్ ఆధ్వర్యంలో వేరు వేరుగా ఆయన విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మచ్చలేని రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్న మహనీయుడని గుర్తు చేశారు కార్యక్రమంలో దుర్గయ్య, చవాన్ సుభాన్ సింగ్, రాంచందర్, రాజు, లక్ష్మణ్, కిషన్, దుర్గయ్య, పుండరీకం, వెంకటేశం, సుదర్శన్, లక్ష్మి, బాలరాజ్, శివ, సుభాశ్ పాల్గొన్నారు.
మున్సిపల్, మండల వ్యాప్తంగా..
అమీన్పూర్ : అమీన్పూర్ మున్సిపల్,మండల పరిధిలో బాబూ జగ్జీవన్రామ్ జయంతి ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ దేవానంద్ ఆధ్వర్యంలో కిష్టారెడ్డిపేట్ గ్రామంలోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పలువురు ప్రజాప్రతినిధులు,ప్రజలు పూల మాలలు వేశారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో చైర్మన్ బాబూ జగ్జీవన్రామ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు.
కంది, ఏప్రిల్ 5 : బాబూ జగ్జీవన్రామ్ జయంతిని ఎద్దుమైలారం గ్రామంలో స్థానిక ఎంపీపీ సరళా పుల్లారెడ్డితో పాటు స్థానిక సర్పంచ్ కాసాల మల్లారెడ్డి జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. అలాగే కంది చౌరస్తాలో వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆనంద్రావు, జంగయ్య, రవి, కుమార్, సురేశ్, స్టార్చ్ కమిటీ సభ్యులు మల్లేశ్, హేమంత్, బందయ్య అర్జున్, పాండు గోపాల్, మహేందర్ పాల్గొన్నారు.
గుమ్మడిదల, ఏప్రిల్ 5 : బాబూ జగ్జీవన్రామ్ జయంతిని మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో సర్పంచ్ చిమ్ముల నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. జడ్పీటీసీ కుమార్గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇవీ కూడా చదవండి…
టీకా తీసుకున్నా నిర్లక్ష్యం వద్దు
ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా
లాక్డౌన్పై నకిలీ జీవో సృష్టికర్త అరెస్ట్