కల్హేర్, ఏప్రిల్ 1: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ధరణి పోర్టల్తో పరిష్కారమవుతున్నాయని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం ఐకేపీ కార్యాలయంలో రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ, అటవీశాఖలకు చెందిన భూములు వివాదాస్పదంగా ఉండడం తో సర్వే చేపట్టి రైతులకు న్యాయం చేస్తామన్నారు. సర్వే చేపట్టిన తర్వాత రెవెన్యూశాఖకు చెందిన భూములైతే వారికి పట్టా పాస్ పుస్తకాలు అందిస్తామన్నారు. అటవీశాఖ పరిధిలో ఉంటే దానికి సంబంధించిన నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ధర ణి పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 10వేల మంది రైతుల సమస్యలు పరిష్కరించడం జరిగిందని వెల్లడించారు. మీ సేవలో అధిక ధరలు తీసుకుంటే తహసీల్దార్ లేదా ఆర్డీవోకు ఫిర్యాదు చేయాలని సూచించారు. జిల్లాలో కల్హేర్, కోహీర్ మండలలోనే రెవెన్యూ, అటవీఖాఖల భూ సమస్యలు ఉన్నాయని తెలిపారు. మండలంలో ఇదివరకే 50 శాతం మేర సర్వే పూర్తయిందని మిగుతాది కూడా 10 రోజుల్లో పూర్తిచేస్తామన్నారు. అంతకుముం దు తహసీల్దార్ కార్యాలయంలో చేపడుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో అంబాదాస్ రాజేశ్వర్, డీఎఫ్వో వెంకటేశ్వర్లు, ఆత్మ కమిటీ చైర్మన్ రాంసింగ్, జడ్పీటీసీ నరసింహారెడ్డి, తహసీల్దార్ జైరాం, రేంజ్ అధికారి దేవీలాల్, కిష్టాపూర్ సర్పంచ్ కిష్టారెడ్డి, నియకులు వెంకటేశంగుప్తా, సర్వేయర్లు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.