ఝరాసంగం /సంగారెడ్డి : పత్తి పంటలో అంతరపంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. జహీరాబాద్ ఎక్సైజ్ సీఐ అశోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..ఝరాసంగం మండలంలోని ఏడాకుల పల్లి గ్రామంలో పత్తి చేనులో అంతరపంటగా గంజాయిని సాగు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు..దాడి చేసి సుమారు 3,000 గంజాయి మొక్కలను ధ్వంసం చేశామన్నారు.
వీటి విలువు సుమారు ఐదు కోట్లు ఉంటుందని సీఐ అశోక్ కుమార్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.