సంగారెడ్డి : బసవేశ్వర ఎత్తిపోతల పథకాలపై ఎమ్మెల్యేలు మహారెడ్డి భూపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లోని ఆర్ అండ్ బీ ఈఎన్సీ కార్యాలయంలో నారాయణఖేడ్, ఆందోల్ నియోజకవర్గాలకు వరప్రదాయులైన బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులకు సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
కార్యక్రమంలో సీఈ అజయ్ కుమార్, ఎస్ఈ మురళీధర్, ఇంజినీర్ కన్సల్టెంట్ మల్లయ్య, ఈఈ భీమ్, డీఈఈ జలంధర్, ఏఈ దిలీప్, ఆర్వీ కన్సల్టెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు.