పుల్కల్ రూరల్ : ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, సైగాం నుంచి గత నాలుగు రోజులుగా సింగూరు ప్రాజెక్టుకు వస్తున్న వరద ఉధృతి కాస్త తగ్గు ముఖం పట్టింది. గురువారం మూడు గేట్లు తెరిచి దిగువకు నీటిని వదిలిన అధికారులు వరద తీవ్రత తగ్గడంతో రెండు గేట్లను మూసేశారు. ప్రాజెక్టులోకి ఇన్ ప్లో 17,823 క్యూసెక్కులు కొనసాగుతుండగా, శుక్రవారం ఉదయం 11 వ గేటు ద్వారా 13,170 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 29.320 టీఎంసీల నీరు నిల్వ ఉంది .ప్రాజెక్టులో నీటి ఎత్తు 523.500 మీటర్లు, క్రేష్ గేట్ ద్వారా 2472 క్యూసెక్కులు, కెనాల్స్ 140 క్యూసెక్కులు, హెచ్ ఎమ్డబ్ల్యూఎస్ 80 క్యూసెక్కులు, ఎమ్బీ 70 క్యూసెక్కులు, ఈవీపీ లాస్ 300 క్యూసెక్కులు వెళ్తున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు విలేకరులతో తెలిపారు. నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో మత్స్యకారులు, రైతులు మంజీర నది పరీవాహక ప్రాంతం వైపు వెళ్లొద్దన్నారు.