పటాన్చెరు, ఏప్రిల్ 27 : సవరించిన ఏరియా జనరేషన్ టెక్నిక్తో సమర్థవంతమైన చిత్రాన్ని ఆవిష్కరించడంపై అధ్యాయనం, విశ్లేషణ, దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం పరిశోధక విద్యార్థిని వి.రమాదేవికి డాక్టరేట్ వరించింది. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగధిపతి ప్రొఫెసర్ కె.మంజునాథాచారి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పరిశోధనలో వేదగణితాలను ఉపయోగించి సవరించిన ఏరియా జనరేషన్ టెక్నిక్ స్కాలర్తో సమర్థవంతమైన ఇమేజ్ మెరుగుదల అనువర్తనాల కోసం తక్కువ ఖర్చుతో, ఎక్కువ శక్తి గల వీఎల్ఎస్ఐ సర్క్యూట్ను రూపొందించిడానికి ప్రతిపాదించినట్టు ప్రొఫెసర్ మంజునాథచారి వివరించారు.
ప్రతిపాదిత రూపకల్పనలో చిత్ర నాణ్యతను అభివృద్ధి చేయడానికి సమర్థవంతమైన ఎడ్జ్ క్యాప్చర్ టెక్నిక్, తక్కువ సంక్లిష్టతతో పదునైన ఫిల్టర్ ఉపయోగించినట్టు ఆయన తెలిపారు. గణన సంక్లిష్టతను, ప్రతిపాదిత రూపకల్పన హార్డ్వేర్ ఖర్చులను తగ్గించడానికి వేదగణితం ఉపయోగించామని, రౌండింగ్ లోపం దిద్దుబాటు పద్ధతులను ఉపయోగించకుండా ఈ పద్ధ్దతి అమలు చేస్తారన్నారు. రమాదేవి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడంపై గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్. శివప్రసాద్, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించిట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.