జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
పుల్కల్ రూరల్ : రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారించాలని జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే చంటిక్రాంతి కిరణ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతుసేవా కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆహార భద్రత పథకం ద్వారా కంది, పెసర పంటలు వేసిన రైతులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. దీనికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు.
రాష్ట్రంలోని రైతులు ఇబ్బందులకు గురికావొద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ వానకాలం, యాసంగి రెండు పంటలకు రైతుబంధు కింద రూ.పదివేల పెట్టుబడి సాయాన్ని ఇస్తూ ఆదుకుంటు న్నారన్నారు. కానీ కేంద్రప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా దొడ్డు ధాన్యాన్ని కొనమని స్పష్టం చేయడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కాబట్టి మనం కూడ ఆలోచించి చిరుధాన్యాల పంటల వైపు దృష్టి సారించాలన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు పండించిన ప్రతిగింజాను టీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వారు స్పష్టం చేశారు. మండల పరిధిలో 15 వేల ఎకరాల్లో వరి, 20 వేల ఎకరాల్లో పత్తి పంటలు వేసినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మెన్ యాదగిరిరెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నర్సింహారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పల్లె సరోజ, శాస్త్రవేత్త రమేశ్, ఏఓ చైతన్య, ఏఈఓలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.