సంగారెడ్డి : జిల్లాలోని పటాన్చెరు మండలం పెద్ద కంజర్ల గ్రామంలో శ్రీ దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం దుర్గా దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ప్రొటెం చైర్మన్కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.