పటాన్చెరు, అక్టోబర్ 18 : రాష్ట్రంలో పశు సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు మండలం నందిగామలోని గోశాలలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాలికుంటు వ్యాధి నివారణకు ఉచిత టీకాలను వేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే, పశువైద్య విభాగం జాయింట్ డైరెక్టర వసంతకుమారితో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి వ్యాప్తిని నివారించేందుకు టీకాలను తప్పకుండా వేయించాలని డెయిరీ రైతులను కోరారు. తెలంగాణ ప్రభుత్వం పశు పోషణకు, అధిక పాల దిగుబడులకు ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. నగరానికి దగ్గరగా ఉండటంతో నియోజకవర్గంలోని పాల ఉత్పత్తిదారులకు మంచి మార్కెట్ అందుబాటులో ఉందన్నారు.
ఆరోగ్యకమైన జాగ్రత్తలు తీసుకుంటే పశువులు చక్కగా ఉంటాయన్నారు. సీఎం కేసీఆర్ పశుపోషణకు, పశువుల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. కార్యక్రమంలో దశరథరెడ్డి, వెంకట్రెడ్డి, పారిశ్రామికవేత్త దుర్గా ప్రసాద్, లక్ష్మణ్, నారాయణరెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.