నాగల్గిద్దా, నవంబర్,22 : సంగారెడ్డి జిల్లా నాగల్గిద్దా మండల కేంద్రంలో గట్టు చప్పుడు కాకుండా ఫ్రెండ్స్ దాబాలో ఆదివారం రాత్రి పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు.. ఎస్ఐ విజయ్రావ్ సిబ్బందితో కలిసి పేకాట స్థావరాలపై దాడి చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 2,28,210 నగదుతో పాటు 17 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 19 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి చేసి కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ..జూదం ఆడినా, ప్రోత్సహించినా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జూదం ఆడడం వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. ఎక్కడైనా జూదం ఆడినట్లు గుర్తిస్తే తమకు సమాచారం అందజేయాలని కోరారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.