న్యాల్కల్/సంగారెడ్డి : ప్రతి గ్రామంలో ఇరువైపులా నాటిన మొక్కలను సరక్షించాలని డీఆర్డీవో శ్రీనివాస రావు అన్నారు. న్యాల్కల్ మండలంలోని ముంగీ గ్రామ శివారులో చేపట్టిన బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను ఆయన పరిశీలించారు. ముళ్ల పొదలను తొలగించి మొక్కలు నాటేందుకు గుంతలను సిద్ధం చేసేలాచర్యలు తీసుకోలని అధికారులను ఆదేశించారు. అనంతరం హద్నూర్ గ్రామ శివారులోని మెటకుంట అల్లాదుర్గ్ రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా మొక్కలను నాటారు.
నాటిన మొక్కలకు ప్రతిరోజు నీరు పోసి కాపాడుకోవాలన్నారు. ఆయన వెంట డీర్డీవో ఏపీడీ
జయదేవ్, ఎంపీడీవో జగదీశ్వర్, పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, ఏపీవో రంగారావు, సర్పంచ్లు వీరమని, అనిత, ఉప సర్పంచ్ షబ్బీర్ ఖాన్, నాయకులు రాజ్కుమార్, ప్రవీణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
నిజామాబాద్ జిల్లాలో దారుణం..నీటిగుంతలో రెండు మృత దేహాలు
విషాదం : దమ్మన్నపేటలో వృద్ధ దంపతుల ఆత్మహత్య
Space Wedding : అంతరిక్షంలో వరుడు.. టెక్సాస్లో వధువు.. వీడియో కాల్లో పెండ్లి
OBC Bill: కోటాపై సీలింగ్ను ఎత్తివేయండి : అధిర్ రంజన్ చౌదరీ