రామచంద్రాపురం, అక్టోబర్10 : ప్రజలందరూ భక్తి మార్గంలో నడిచినప్పుడు సమాజంలో శాంతికి బాటలు పడుతాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం ఆర్సీపురం డివిజన్లోని శ్రీనివాస్నగర్కాలనీలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం పక్కన నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంజనేయస్వామి ఆలయం పక్కనే నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి తమవంతు సహకారం అందజేస్తామన్నారు.
శ్రీనివాస్నగర్కాలనీలో ఆంజనేయస్వామి, శివాలయం ఆలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఏ మతం వారు ఆ మత దైవాన్ని నిత్యం స్మరించుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్ప, మాజీ కార్పొరేటర్ అంజయ్య, డివిజన్ అధ్యక్షుడు గోవింద్, సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్, ప్రధానకార్యదర్శి బేకు యాదయ్య, పూజారి కిషన్ తదితరులు ఉన్నారు.