వర్తక, వాణిజ్య దుకాణాల మూసివేత
వెలవెలబోయిన 161వ జాతీయ రహదారి
పెద్దశంకరంపేట, ఏప్రిల్ 24 : పట్టణంలో శనివారం నుంచి లాక్డౌన్ విధించారు. మండలం లో సుమారు 200కు పైగా కరోనా పాజిటివ్ కేసు లు నమోదు కావడంతోపాటు మండలంలో నలుగురు కరోనాతో చనిపోవడంతో స్వచ్ఛంద లాక్డౌన్ విధించారు. సర్పంచ్ అలుగుల సత్యనారాయణతోపాటు ప్రజాప్రతినిధులు పిలుపునివ్వడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావడంలేదు. ఉదయం పాలు, పెరుగు, కూరగాయలు, కిరాణా వస్తువులు తదితర సామగ్రిని వినియోగదారులు కొనుగోలు చేశారు. ప్రజలు, వర్తక, వాణి జ్య, దుకాణాల సమూదాయాల వారు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. వాహనాలు, ఆటో లు, ప్రైవేట్ వాహనాలు తిరగకపోవడంతో 161వ జాతీయ రహదారి వెలవెలబోయింది. కిరాణం, వర్తక, వాణిజ్య, హోటళ్లు, చిరువ్యాపారులు మధ్యాహ్నం ఒంటిగంట వరకు తెరవడంతో ప్రజలు వస్తువులు కొనుగోలు చేసుకున్నారు. పట్టణంలో వర్తక, వాణిజ్య దుకాణాలు మూసి వేయడంతోపాటు ప్రజలు ఎవ్వరూ రహదారులపై తిరగకపోవడంతో లాక్డౌన్ విజయవంతమైంది.