సదాశివపేట: పేద ప్రజల పెన్నది సీఎంఆర్ఎఫ్ అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. బుధవారం సదాశివపేట పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 15 మంది పేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను చింతా ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆరోగ్య రక్షణకు సీఎంఆర్ఎఫ్ వరం లాంటిదన్నారు. నిరుపేదలు అనారోగ్యానికి గురై కార్పొరేట్, ప్రైవేట్ దవాఖానల్లో చికిత్సలు తీసుకుని వైద్య ఖర్చులు భరించలేని వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటున్నదని కొనియాడారు.
నియోజకవర్గంలో ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ నిధి నుంచి సుమారు రూ.25 కోట్లు అందించడం జరిగిందని, పేదలు ఆరోగ్య సమస్యలు ఉంటే తనను సంప్రదిం చాలని సూచించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన వారికి బుధవారం 5 మందికి రూ.3.48 లక్షలు చెక్కులు అందజేశామన్నారు. కార్యక్రమంలో సదాశివపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రోళ్ల చిన్న (వినోద్కుమార్), మున్సిపల్ కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం, విద్యాసాగర్రెడ్డి, మొబిన్, సమీ, జున్నూ, బిట్ల ప్రేమ్కుమార్, సంగారెడ్డి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు బైండ్ల అశోక్కుమార్, మున్సిపల్ కౌన్సిలర్ లాడే మల్లేశం,నాయకులు చిల్వేరి ప్రభాకర్, మోహన్నాయక్ పాల్గొన్నారు.