గుమ్మడిదల, అక్టోబర్22 : ప్రతిపక్షాలు దిగజారుడుగా మాట్లాడుతున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ను, పార్టీ అధినేతను తక్కువ చేసి మాట్లాడితే వెంటనే దీటుగా సమాధానం చెప్పాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.
శుక్రవారం గుమ్మడిదల మండల కేంద్రంలోని చంద్రారెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన టీఆర్ఎస్ మండల స్థాయి కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ముఖ్యాతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్15న జరిగే విజయ గర్జన సభకు భారీ స్థాయిలో కార్యకర్తలను, పార్టీ అభిమానులను సన్నద్ధం చేయాలని మండల స్థాయి నాయకులకు సూచనలు చేశారు.
ప్రతి గ్రామానికి వాహనాలను పంపిస్తామన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడై విజయగర్జన బహిరంగ సభను విజయవంతం చేయడానికి కృషి చేయాలన్నారు. ఈ నెల 25వ తేదీన జరిగే ప్లీనరీ సమావేశానికి పరిమిత సంఖ్యలో హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ నెల 27వ తేదీన నియోజకవర్గ స్థాయి సమావేశానికి ప్రతి మండలం నుంచి భారీ స్థాయిలో కార్యకర్తలు హాజరు అయే విధంగా కృషి చేయాలని కోరారు.
కార్యక్రమలో జడ్పీటీసీ కుమార్గౌడ్, ఎంపీపీ సద్ది ప్రవీణ, వైస్ ఎంపీపీ మంజుల వెంకటేశ్గౌడ్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోవర్ధన్రెడ్డి, విజయభాస్కర్రెడ్డి, ఆలేటి శ్రీనివాస్రెడ్డి, మండల అధ్యక్షుడు మహ్మద్ హుస్సేన్, వీరభద్రస్వామి ఆలయ కమిటీ చైర్మన్ గటాటి భద్రప్ప, సర్పంచ్లు నర్సింహారెడ్డి,శంకర్, దీప, రాజశేఖర్, ఎంపీటీసీలు ప్రబాకర్రెడ్డి, రాజ్యలక్ష్మి, పద్మ, హాజరయ్యారు.