పుల్కల్ రూరల్ : సంగారెడ్డి జిల్లా బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు అంతకంతకూ ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతూనే ఉన్నది. అప్రమత్తంగా ఉన్న నీటి పారుదల శాఖ అధికారులు వచ్చిన ఇన్ ప్లో వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. బుధవారం రాత్రి 11ః15 నిమిషాలకు 11134 క్యూసెక్కుల ఇన్ ప్లో పెరగడంతో అప్రమత్తమైన అధికారులు 6 గేటు 2 మీటర్లు పైకి ఎత్తి నీటిని దిగువకు వదిలారు. అంతలోనే ఇన్ ప్లో 13 వేల క్యూసెక్కులు పెరగడంతో గురువారం ఉదయం 10ః30 ప్రాంతంలో 11 వ గేటు, సాయంత్రం 5ః00 గంటలకు 9 గేటు మొత్తంగా మూడు గేట్ల ద్వారా రెండు మీటర్ల ఎత్తులో 34673 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులు తున్నట్లు అధికారులు తెలిపారు. వరద ఉధృతి ఎక్కువగా కొనసాగితే మరో గేటును కూడ తీసే అవకాశం ఉందని, నది పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.