రామచంద్రాపురం : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ అన్నారు. శనివారం భారతీనగర్ డివిజన్లోని ఓల్డ్ ఎంఐజీలో డివిజన్ కార్పొరేటర్ సింధూఆదర్శరెడ్డితో కలిసి లబ్ధిదారులకు కొత్త రేషన్కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండింట్లో ప్రభుత్వం రాజీపడకుండా పనిచేస్తుందన్నారు.
పేదల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషిచేస్తున్నారని తెలిపారు. పేదలు కడుపునిండా అన్నం తినాలనే ఉద్ధేశంతో రేషన్ కార్డులను అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం కార్పొరేటర్ సింధూ ఆదర్శరెడ్డి మాట్లాడుతూ గతంలో ఎప్పుడు జరుగని అభివృద్ధిని టీఆర్ఎస్ హయాంలో మనం చూస్తున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేద ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారని తెలిపారు. భారతీనగర్ డివిజన్లో అర్హులైన వారందరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్గౌడ్, రఘునాథ్రెడ్డి, నాగమణి, బాలయ్య, సత్యనారాయణ, జ్యోతి, భాస్కర్, సంపత్, మూర్తి పాల్గొన్నారు.