సంగారెడ్డి : సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్ట్కు ఆమోదం తెలిపి పరిపాలన అనుమతులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు జిల్లా ఎమ్యెల్యేలు ఆందోల్ ఎమ్యెల్యే క్రాంతి కిరణ్, నారాయణఖేడ్ ఎమ్యెల్యే భూపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్యెల్యే మాణిక్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి హరీశ్రావుతో నేతృత్వంలో శుక్రవారం శాసన సభలో ముఖ్యమంత్రిని కలిశారు. ఎన్నో ఏండ్లుగా వివక్షకు గురైన అందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాలు కేసీఆర్ చొరవతో సస్యశామలంగా మారనున్నాయని తెలిపారు.