మునిపల్లి,మే 15 : గొల్ల కురుమలు అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. ఆదివారం మునిపల్లి మండలం కంకోల్ గ్రామంలో జరుగుతున్న బీరప్ప స్వామి జాతరకు హాజరైన ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గొల్ల, కురుమలకు తెలంగాణ ప్రభుత్వం రాయితీపై గొర్రెలు పంపిణీ చేసి వాళ్లను ఆర్థికంగా అభివృద్ధి చేస్తుందన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలను గొల్లకురుమలు అన్ని రకాలుగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ శైలజ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సాయికుమార్, మండల పార్టీ అధ్యక్షుడు సతీష్, సర్పంచ్లు విశ్వనాథం పాటిల్,రమేష్, ఉన్నారు.