సంగారెడ్డి అర్బన్, మే 13 : టీప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం కంది మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సంగారెడ్డి రూరల్ ఎస్ఐ శ్రీనివాస్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కంది గ్రామానికి చెందిన మన్నె నర్సయ్య (55) ఉదయం 5గంటలకు పశువుల పేడను పెంటలో వేయడానకి వెళ్తున్న సమయంలో.. శంకర్పల్లి నుంచి సంగారెడ్డి వైపు అతివేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని, మృతుడి కుమారుడు సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.