అమీన్పూర్, అక్టోబర్ 12 : టీఆర్ఎస్ హయాంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. అమీన్పూర్ మండలం వడక్పల్లి గ్రామం నుంచి ఓఆర్ఆర్ వరకు రూ.2 కోట్ల 60 లక్షల అంచనాతో సర్వీస్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై బీటీ రోడ్డు పనులను జడ్పీటీసీ సుధాకర్రెడ్డి, ఎంపీపీ ఈర్ల దేవానంద్, సర్పంచ్ లలితతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు.
అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేస్తుందని ఆయన అన్నారు.
గ్రామాల నుంచి పట్టణాలు, కలుపుతూ రోడ్లను నిర్మిస్తున్నారని, దీంతో రవాణా సౌకర్యం మెరుగుపడి ప్రజలకు ఇబ్బందులు తప్పుతున్నాయని అన్నారు. త్వరితగతిన రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు.
నాణ్యతలో ఎటువంటి రాజీ పడొద్దని వారికి సూచించారు. కార్యక్రమంలో జానకంపేట్ సర్పంచ్ పాండు, వడక్పల్లి ఉపసర్పంచ్ శ్రీకాంత్రెడ్డి, గ్రామ పెద్దలు రాంరెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గం, తదితరులు పాల్గొన్నారు.