రామచంద్రాపురం, అక్టోబర్24 : విజయగర్జనకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి భారీగా తరలివెళ్లి విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆర్సీపురం డివిజన్లోని లక్ష్మీగార్డెన్స్లో భారతీనగర్, ఆర్సీపురం, పటాన్చెరు డివిజన్ల కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్లో నిర్వహించబోయే విజయగర్జన బహిరంగసభను పార్టీ శ్రేణులు విజయంవంతం చేయాలని సూచించారు. పటాన్చెరు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులతో పాటు ప్రజలను విజయగర్జనకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని, కనివిని ఎరుగని రీతిలో నియోజకవర్గం పెద్ద సంఖ్యలో బహిరంగ సభకు వెళ్దామని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
వరంగల్లో నిర్వహించే బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోవాలన్నారు. వచ్చే నెల 15వ తేదీన నిర్వహించే విజయగర్జనకు అందరు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు.
కార్యక్రమంలో ఆర్సీపురం, భారతీనగర్, పటాన్చెరు డివిజన్ల కార్పొరేటర్లు పుష్పానగేశ్, సింధూఆదర్శ్రెడ్డి, మెట్టుకుమార్యాదవ్, డివిజన్ అధ్యక్షుడు గోవింద్, సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్, ప్రధానకార్యదర్శి బేకు యాదయ్య, మాజీ కార్పొరేటర్ అంజయ్య, ఏఎంసీ డైరెక్టర్ ప్రమోద్గౌడ్, నాయకులు తదితరులు ఉన్నారు.