సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 29 : అపోలో ఫార్మసీ కంపెనీలో పని చేసేందుకు అర్హులైన అభ్యర్థులకు ఈ నెల 29న జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి అధికారి ఎ వందన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 160 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 29న ఉదయం 10.30 గంటలకు స్థానిక బైపాస్ రోడ్డులోని పాత వెలుగు కార్యాలయ ఆవరణలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు అర్హులైన అభ్యర్థులు హాజరుకావాలన్నారు.
అభ్యర్థులు బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ ఉత్తీర్ణత కలిగి ఉండాలని, వేతనం రూ.11 వేల నుంచి రూ.16 వేల వరకు ఉంటుందన్నారు. హైదరాబాద్లో పని చేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగల వారు జాబ్ మేళాకు విధిగా మాస్క్ ధరించి రావాలని, భౌతిక దూరం పాటించాలని ఆమె స్పష్టం చేశారు.