అందోల్/సంగారెడ్డి : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. అందోల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో అందోల్ – జోగిపేట మున్సిపాలిటీ స్వతంత్ర కౌన్సిలర్ కొరబోయిన నాగరాజు (నాని) ఆయన అనుచరులను టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ గుప్తా, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చాపల వెంకటేశం, మాజీ ఎంపీపీ రామ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు అల్లే గోపాల్, జుట్టు విఠల్, బాయికాడి భూమయ్య, గాజుల నవీన్, తదితరులు పాల్గొన్నారు.