రామచంద్రాపురం : తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెల గ్రామంలో ఉన్న టీఎస్ మోడల్ స్కూల్ను శుక్రవారం మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ సరోజినీదేవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మోడల్ స్కూల్ నిర్వహణ, తరగతి గదులు, ల్యాబ్లను పరిశీలించి మాట్లాడారు. రాష్ట్రంలో మోడల్ స్కూళ్లు ప్రత్యేక స్థానం, గుర్తింపును పొందాయని వాటిని కాపాడుకునేందుకు ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలన్నారు.
పది, ఇంటర్ ఫలితాల్లో మోడల్ స్కూళ్లు కార్పొరేట్ స్కూళ్ల కంటే మెరుగైన ఫలితాలను
సాధిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాంప్రసాద్, ఉపాధ్యాయులు ఉన్నారు.