సంగారెడ్డి: జిల్లాలోని నారాయణ ఖేడ్లో భారీ వర్షం కురిసింది. శనివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుండటంతో పట్టణ శివారులో ఉన్న వాగు పొంగిపొర్లుతున్నది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తుర్కపల్లి తండాలోని పలు ఇళ్లు వర్షపు నీటితో నిండిపోయాయి. వ్యవసాయ మార్కెట్లో నిలువ ఉంచిన ధాన్యం తడిసి ముద్దయ్యింది.
నైరుతి రుతుపవనాలు రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. రుతుపవనాలు కేరళ అంతటా విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణాదిలో చాలా ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. రానున్న రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. నైరుతి దిశనుంచి ఈదురుగాలులు వీస్తుండడంతో రాగల మూడు రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.