అందోల్, జనవరి 11: రైతుల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని అందోల్ ఎంపీపీ బాల య్య అన్నారు. పంటలసాగుకు పెట్టుబడికోసం రందిలేకుండా రైతుబంధును అందజేస్తున్నదని పేర్కొన్నారు. మంగళవారం ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభు త్వం గత ఏడేండ్లలో రైతుల సంక్షేమంకోసం కృషిచేస్తున్నదన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సబ్సిడీ ఎరువులు,విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు అందజేస్తూ వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మార్చిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ. 50వేలకోట్ల ను రైతుల ఖాతాల్లో జమచేసిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్దేనన్నారు. మండల వ్యాప్తంగా ఎంతో మంది రైతులు రైతుబం ధు, రైతుబీమాతో లబ్ధిపొందారని గుర్తుచేశారు. దీన్ని గుర్తించిన రైతులు గ్రామాల్లో పండుగ వాతావరణంలో సంబురాలు చేసుకుంటున్నారని వివరించారు. ఆయా గ్రామాల్లో చేపట్టిన పనులు, కల్పించాల్సిన వసతులను ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తీసుకువచ్చారు. నర్సరీల నిర్వాహణ, పల్లెప్రకృతి వనాల్లో మొక్కల పెంపకంపై దృష్టిపెట్టాలన్నారు. గ్రామాల్లో ప్రతి రోజూ చెత్తను సేకరించాలని, పారిశుధ్యం లోపించకుండా చర్యలు చేపట్టాలన్నారు. మూ డు నెలలకు ఒకసారి నిర్వహించే సమావేశానికి పలు శాఖల అధికారులు హాజరు కాకపోవడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఎంపీపీ తెలిపారు. ఎంపీడీవో సత్యనారాయణ, ఎంఈవో కృష్ణ, వైస్ ఎంపీపీ మహేశ్వర్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.