జహీరాబాద్, జనవరి 11 : ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉండి మహ్మద్ ఫరీదుద్దీన్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ గుర్తు చేశారు.
మంగళవారం జహీరాబాద్ పట్టణంలో నిర్వహించిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్ సంతాప సభలో ఎంపీ బీబీ పాటిల్తో పాటు జహీరాబాద్, ఆందోల్ ఎమ్మెల్యేలు మానిక్రావు, చంటి క్రాంతికిరణ్, ఎమ్మెల్సీ ఫారూఖ్హుస్సేన్, జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీ, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. జహీరాబాద్ నియోకవర్గానని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎంతో కృషి చేశారన్నారు. మంత్రిగా, ఎమ్మెల్సీగా ప్రజల సమస్యలు పరిషారం చేసేందుకు నిరతరం కృషి చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ..అన్ని వర్గాల సంక్షేమం కోసం ఫరీదుద్దీన్ చేసిన పనులను గుర్తు చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కారం చేసేందుకు నిరతరం కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.