సంగారెడ్డి : జహీరాబాద్, కర్నాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బీదర్ జిల్లాలోని కరంజా ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేయడంతో మంజీరా నది లోకి భారీగా వరద నీరు వస్తున్నది. మంజీరా పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలను రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. జహీరాబాద్ డివిజన్లోని పలు వాగులు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.