పటాన్చెరు: తెలంగాణలో భారీగా చేపల పెంపకం జరుగుతున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లక్ష చేప పిల్లలను సాకీ చెరువులోకి వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పటాన్చెరు పట్టణంలో సాకీచెరువు, తీగలనాగారం చెరువు, రోషం చెరువుల్లో రూ.7 లక్షల విలువైన మూడున్నర లక్షల చేప పిల్లలను వదిలినట్లు, నియోజకవర్గ పరిధిలో 42 సొసైటీల ద్వారా రూ. 70 లక్షల విలువైన 35 లక్షల చేప పిల్లలను పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను ఇస్తూ ప్రోత్సహిస్తున్నదన్నారు. తెలంగాణలో చేపల పెంపకంతో నీలి విప్లవాన్ని తీసుకొస్తున్నామన్నారు, కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ కుమార్గౌడ్, కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, మత్స్యశాఖ జిల్లా అధికారి సతీశ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు అఫ్జల్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్కుమార్, తులసీదాస్, వెంకటేశ్, మత్స్యకారులు పాల్గొన్నారు.