18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలి : పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి బొల్లారం : ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం ఆయన బొల్లారం మున్సిపల్ పాత కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్పెషల్ కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ రోజాబాల్రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కొవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టుతున్నదన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చంద్రారెడ్డి, వైద్యాధికారి రాధిక, ఆర్వో శ్రీధర్, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు, మున్సిపల్, వైద్య సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.