న్యాల్కల్, అక్టోబర్ 26 : చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జహీరాబాద్ మున్సిఫ్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి దుర్గాప్రసాద్ అన్నారు. న్యాయ సేవాధికారి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని మెటల్కుంట, బసంతపూర్ గ్రామాల్లో చట్టాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మోటరు వాహనాల చట్టం, డ్రంక్ అండ్ డ్రైవ్, బాలకార్మిక నిర్మూలన చట్టం, అగ్రిమెంట్, సేల్ డీడ్ రాసే విధానం, ఉచిత న్యాయ సేవ సహయం పై ప్రజలకు మున్సిఫ్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జీ దుర్గాప్రసాద్ అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో జహీరాబాద్ బార్ అధ్యక్షుడు దత్తాత్రేయరెడ్డి, ఏజీపీ సయ్యద్ అహ్మద్, సీనియర్ న్యాయవాది పాండురంగారెడ్డి, ఎంపీడీవో జగదీశ్వర్, పంచాయతీ అధికారి శ్రీనివాస్రావు, హద్నూర్ ఎస్ఐ వినయ్కుమార్, సర్పంచ్ ఫిటర్రాజ్, లక్ష్మి, నాయకులు పాండురంగారెడ్డి, రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.