కంది/సంగారెడ్డి : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని కాంటినెంటల్ హాస్పిటల్స్ సీఈ ఓ డాక్టర్ రియాజ్ ఖాన్ అన్నారు. గురువారం కంది గ్రామంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నిలోజీ (ఐఐటీ)లో కాంటినెంటల్ హాస్పిటల్ క్లినిక్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
ఐఐటీలో పతి ఏటా 4000 మందికి పైగా విద్యార్థులు వివిధ ప్రాంతల నుంచి వచ్చి ఇక్కడే ఉంటూ చదువుకుంటున్నారని తెలిపారు. వారితో పాటు సుమారు 1000 మందికి పైగా ఐఐటీ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే నివాసముంటున్నారన్నారు . విద్యార్థులకు , సంస్థ ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించాలనే ముఖ్య ఉద్దేశంతో అన్ని స్పెషలిటీల వైద్య సేవలతో క్లినిక్ ను క్యాంపస్ లో ఏర్పాటు చేశామన్నారు.
ఐఐటీ డైరెక్టర్, ప్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. ప్రస్తుత యాంత్రిక జీవనం విధానంలో ఆరోగ్యం పై అశ్రద్ధ వహించడం మంచిదికాదన్నారు. ఎలాంటి చిన్నపాటి ఆరోగ్య సమస్య తలెత్తినా వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.