అందోల్/సంగారెడ్డి : మత్స్య కారుల సంక్షేమం కోసం తెలంగాణా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నాదని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. మంగళవారం అందోల్ పెద్ద చెరువులో స్థానిక నాయకులు, మత్స్యకార సొసైటీ సంఘం వారితో కలిసి 1,98,000 చేప పిల్లలను వదిలారు.
ఈ సంద్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల అభివృద్ధికోసం కృషి చేస్తుందని చెప్పారు. అందులో భాగంగా మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికోసం ప్రతి ఏటా అధిక మొత్తంలో చేప పిల్లలను వదులుతునదన్నరు.
ఇందులో భాగంగా అందోల్ పెద్ద చెరువులో రూ. 3, 40, 5600 విలువగల లక్షా 98 వేల చేప పిల్లలు వదలడం జరిగిందన్నారు. మత్స్యకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, సొసైటీ గా ఏర్పడి తామే చేప పిల్లలను పట్టి ఎగుమతి చేసి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కాంట్రాక్టర్ల కు అవకాశం ఇవ్వకూడదని అన్నారు.
అనంతరం గంగాపుత్ర సొసైటీ వారి కోసం కమ్యూనిటి హాల్ కోసం భూమి పూజ చేసారు. కార్యక్రమంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏడీ సతీష్, మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ గుప్తా, అందోల్ ఎంపీపీ బాలయ్య, జడ్పిటిసి రమేష్ తదతరులు పాల్గొన్నారు.