హత్నూర, అక్టోబర్ 21 : దుర్గామాత ఆలయ అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం హత్నూర మండలం దౌల్తాబాద్లో జరుగుతున్న దుర్గామాత విగ్రహ పునఃప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిఒక్కరు భక్తిభావాన్ని అలవరుచుకోవాలన్నారు.
దేవాలయంలో అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్టాపనకు కృషి చేసిన నిర్వహకులను అభినందించారు. కాగా, ఆలయ అభివృద్ధికి తనవంతు కృషిచేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొన్యాల వెంకటేశం, ఎంపీటీసీ కొన్యాల ఇందిర, నిర్వాహకులు కల్వ శ్రీనివాస్, నాయకులు శ్రీనివాస్గౌడ్, ఇంద్రశేఖర్రెడ్డి, శ్రీకాంత్, కిషన్గౌడ్, మన్నె రమేశ్, దుర్గయ్య, సాయి, వినోద్, తదితరులు పాల్గొన్నారు.